రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం..
సికింద్రాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రేవంత్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో మందిరాలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేశామని అన్నారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని ధ్వజమెత్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇవాళ(సోమవారం) డీజీపీ జితేందర్ను ఎంపీ రఘునందన్ రావు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో రఘునందన్ రావు మాట్లాడుతూ. డీజీపీకి ఆలయాలపై దాడుల విషయం తెలిసిన ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.
ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ స్లీపర్స్ సెల్స్కు రాష్ట్రంలో ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇది పోలీసులకు సమాజానికి మంచిది కాదని అన్నారు. రాజకీయ అవసరం కోసం దీనిని డైవర్ట్ చేయొద్దని అన్నారు. ప్రజలే పోలీసులపై దాడి చేసినట్లు పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం..
by kana bai
Published On: October 21, 2024 10:24 pm