గోల్కొండ, హైదరాబాద్ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పురస్కరించుకుని గోల్కొండలో తొలి బోనం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని శ్రీ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ –ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే బోనాల పండుగను గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం అనాది కాలంగా వస్తున్న సంప్రదాయమని పేర్కొన్నారు. ఊరేగింపు రూపంలో ఆలయం వరకు వెళ్లి తొలి బోనం సమర్పించడం ప్రత్యేకమైన భక్తి విశ్వాసానికి నిదర్శనమన్నారు.హైదరాబాద్లో ప్రారంభమైన లష్కర్ బోనాల ప్రభావంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అంతటా గ్రామాలు, బస్తీల్లో బోనాలు నిర్వహించడం ఆనందకరమన్నారు. ఈ పండుగను కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పాడి పంటలు బాగా పండడం, రాష్ట్రం శాంతి, సమృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ జరుపుకుంటున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గోల్కొండ బోనాల ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
