*అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు*
*ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చిన స్వామి*
*ఇల్లందకుంట జనవరి 10 ప్రశ్న ఆయుధం*

భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రాతకాలంలోనే ఉత్తర ద్వార ద్వారా స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పించారు వేదమంత్రోచనంలో మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, వంశీధర్ ఆచార్యుల ఆధ్వర్యంలో గరుడ వాహనంపై సీతారాములను అధిరోహింపజేసి ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తుల కోసం ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించారు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి తో పాటు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు తెల్లవారుజామున నుండి వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు భారీగా క్యూ లైన్ లలో బారులు తీరారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామాలయంలో వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా ఆలయ ఈవో కందుల సుధాకర్ ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలీస్ బందోబస్తు మధ్య స్వామి వారి దర్శనాన్ని కల్పించారు
Post Views: 36