Site icon PRASHNA AYUDHAM

ముక్కోటి ఏకాదశి పర్వదినం కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో

IMG 20250110 WA0261

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 10 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ ఆవరణలో కోదండ రామ ఆలయంలో రాజస్థాన్ సేవా సంఘం మరియు రామాలయ గుడి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీళ్లు, టిఫిన్సు స్వీట్స్, పూరి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి మరియు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఏఓ మీనా ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని తదితర పూజా.. భజన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి భక్తులకు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ పెద్దలను సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దలు అశోక్ రాటి, దుర్గా శంకర్ జాజు, పవన్ కుమార్ జాజు, బ్రిజ్ లాల్ అగర్వాల్, గోపాల్ ధరక్, కంభంపాటి రమేష్, పాండయ్య, నారాయణ దాస్, రాజేష్, నాగేశ్వరరావు త్రీ టౌన్ ఏఎస్ఐ రఘు, రామాలయ గుడి కమిటీ అధ్యక్షులు చలం తదితరు పెద్దలు, భక్తులు సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version