అమీన్ పూర్ పోలీసు స్టేషన్ ను సందర్శించిన మల్టీ జోన్-2 ఐజీ వి.సత్యనారాయణ

IMG 20241011 195933

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): అమీన్ పూర్ పోలీసుల పని తీరు బాగుందని, నేషనల్ లోక్ ఆధాలత్ లో సైబర్ క్రైమ్ లో జిల్లాకు మూడవ స్థానం రావడంలో అమీన్ పూర్ పోలీసులదే కీలక పాత్ర అని మల్టీ జోన్-2 ఐజీ వి.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నాడు సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీసు స్టేషన్ ను మల్టీజోన్-2 ఐజీ వి.సత్యనారాయణ సందర్శించి, గౌరవ వందనం స్వీకరించి, పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అమీన్ పూర్ పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మినీ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. రిసెప్షన్ రిజిస్టర్ ను తనిఖీ చేసి, ప్రతి పిటిషన్ ను ఆన్ లైన్ చేయాలని, పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. స్టేషన్ రికార్డులను ఒక్కొక్కటిగా తనిఖీ చేస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలసుకున్నారు. ఏ క్రైమ్ లో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఐజి గారు తన అనుభవపూర్వక సలహాలు సూచనలు చేశారు. అమీన్ పూర్ హైదరాబాద్ పరివాహక ప్రాంతం, వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతం కావున ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఈ ప్రాంతంలో నివాసం ఉండటానికి ఇష్టపడతారని, తరుచూ ఉద్యోగుల తాకిడి వలన అధిక ట్రాఫిక్ సమస్య ఉంటుందని, ఈ సమస్యను అధిగమించడానికి ట్రాఫిక్ ఎంఫోర్స్ మెంట్ చేయాలని సూచించారు. అదే విధంగా అమీన్ పూర్, పటాన్ చెర్వు మరియు బొల్లారాం పారిశ్రామిక ప్రాంతం కావడం వల్ల ఎక్కువగా మైగ్రేట్ లేబర్ ఉంటారని, దొంగతనాలు జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని, నాకాబంది వంటి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. తరుచూ వెహికిల్ చెక్కింగ్ చేస్తూ, గంజాయి, గుట్కా అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లాలో నిషేదిత గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ అమ్మకాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కు పాదం మోపాలని అన్నారు. డయల్-100 కాల్స్ విషయంలో బ్లూకోర్ట్ సిబ్బంది త్వరితగతిన స్పందించాలని, అతి తక్కువ కాల వ్యవధిలో నేర స్థలాన్ని చేరుకున్నట్లైతే నేరం యొక్క గ్రావిటీని తగ్గించవచ్చని, నేరం జరగకుండా ఆపవచ్చు అన్నారు. అధికారులు, సిబ్బంది పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, సత్: ప్రవర్తనతో ఉండాలని సూచించారు. ఫిర్యాది సమస్యను ఓపికగా విని, వారి సమస్య పరిష్కారం దిశగా సూచనలు చేయాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ.జీ మాట్లాడుతూ.. ఆన్ లైన్ మోసాలల్లో విద్యావంతులే అధికం అని, యువత ఈజీ మనీ సంపాదించాలనే దూరాశతో సైబర్ మోసగాళ్ళు పాన్నిని వలలో పడుతున్నారని, డబ్బుల ఊరికే రావని గుర్తించాలన్నారు. హైడ్రా పేరుతో, NOC పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బేష్ అని, సిబ్బంది కొరతతో కొంతవరకు ఇబ్బందులు ఉన్న రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సేవలను అందించడానికి కృషి చేస్తామని ఐ.జి. వివరించారు. జిల్లా ప్రజల శాంతి భధ్రతలకు విఘాతం కలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసి నేరాలకు పాల్పడినట్లైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ గా పరిగణించి, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సమాచారం తెలిసినట్లైతే S-Nab నెంబర్: 8712656777 కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్, అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, పటాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి, అమీన్ పూర్ ఇన్స్పెక్టర్స్ సదా నాగరాజు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శేఖర్, ఎస్ఐ లు విజయ్, సోమేశ్వరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now