వీధి కుక్కల,కోతుల దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందిన మున్సిపల్ చైర్మన్,కమిషనర్
బూడిది గోపి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు…
జనగామ పట్టణంలో రోజురోజుకు గుంపులు గుంపులుగా పెరిగిపోతున్న కుక్కలు,కోతులతో జనగామ పట్టణ ప్రజలు భయం గుప్పెట్లో నివసిస్తున్నారని కుక్కలని కోతులని నివారించడంలో మున్సిపల్ చైర్మన్ పోకల జమున లింగయ్య మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పూర్తిగా వైఫల్యం చెందారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి అన్నారు.ముఖ్యంగా చిన్నపిల్లల పైన మహిళల పైన ఇవి దాడి చేస్తున్నాయని ఆసమయంలో ఎవరైనా వాటిని నిరోధిస్తే తప్ప విడిచి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ పట్టణంలో ఏ వార్డులో చూసిన గుంపులు గుంపులుగా సెంచరిస్తూ దాడులకు దిగబడుతున్నాయని వీటిని నిరోధించాలని ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మున్సిపాలిటీ పాలకమండలి పట్టించుకున్న పాపాన పోవట్లేదని ప్రజా సమస్యలు గాలికి వదిలేసి వారికి వచ్చే కమిషన్ల పైనే దృష్టి పెడుతున్నారు తప్ప కుక్కలను కోతులను నివారించకపోవటం ఫలితంగా ప్రజలు జంతువుల బారినపడి బలవుతున్నారని అన్నారు.ఈరోజు జనగామ లోని ఇండస్ట్రియల్ ఏరియా కు చెందిన మాదంశెట్టి రాము కుమారుడు మాదంశెట్టి మహోన్నత ఏడు సంవత్సరాల బాలుడు ఇంటి ముందు సైకిల్ తొక్కుతుండగా బాలుడి పై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేసి ఎక్కడికి కండ మాంసాన్ని పికాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహోన్నతుకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా జనగామ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ స్థానిక సంస్థలు జోక్యం చేసుకొని జనగామ పట్టణంలో కోతుల కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు……