Headlines :
-
“మున్సిపల్ కమిషనర్ ఎం.డి. అయాజ్ పన్నుల వసూళ్ల వేగవంతం చేయాలని ఆదేశాలు”
-
“జమ్మికుంట పన్నుల వసూళ్లపై కమిషనర్ అయాజ్ ప్రత్యేక సమీక్ష”
-
“2024-25 ఆర్థిక సంవత్సరానికి 100% పన్నుల వసూళ్ల లక్ష్యం”
-
“మున్సిపల్ కమిషనర్: పన్నులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి”
-
“జమ్మికుంట పన్నుల వసూళ్లలో 51.37% పూర్తయింది, 100% లక్ష్యంగా వేగవంతం”
*మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్*
*జమ్మికుంట డిసెంబర్ 7 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట పట్టణ అభివృద్ధికి తోడ్పడుతున్న పట్టణ ప్రజల నుండి ఇంటి పన్నులు, నల్ల పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ తన సిబ్బందితో అన్నారు. శనివారం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ లతో ప్రత్యేక సమావేశం నిర్వచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మొహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్నుల వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు వేగవంతం చెయ్యాలని పట్టణంలోని ప్రజలు పన్నులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు నేటికీ 51.37 % వసూలు అయినవని100% వసూలు చెయ్యాలని ఆదేశించారు ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ నరేష్ , రెవెన్యూ అధికారి భాస్కర్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.