దేశవ్యాప్త సమ్మె నోటీసు ను కమిషనర్ కు మున్సిపల్ కార్మికులు అందజేత
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 27
జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో తాము పాల్గొంటున్నామని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్, కామారెడ్డి (ఎ.ఐ.టి.యు.సి. అనుబంధం) ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల 102 సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, కార్మిక హక్కులను రద్దు చేస్తూ 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్ లు తెచ్చి కార్మికుల హక్కులను హరిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేఖ విధానాలతో 47 కోట్ల మందికి సష్టం కలుగుతున్న సందర్బంలో ఇప్పటికే 27 సార్లు సమ్మెలు చేసి కోడ్ ల అమలును ఆపిందన్నారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా జులై,9 న సార్వత్రిక సమ్మెలు చేస్తున్నాము. కావున జులై 9న జరిగే ఒకరోజు దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొనేందుకు సహకరించాలని, మా రాష్ట్ర కమిటీ తీర్మాణం చేసిందనీ ఆ వినతి పత్రంలో కోరడం జరిగిందన్నారు. తేది:09-07-2025 రోజున జరుగు ఒక రోజు నమ్మె శాంతియుతంగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పాల్గొంటాము అన్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి. మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాన్ని పెర్మనెంట్ చేసేలోపు రూ.20,000/- చెల్లించాలి. సుప్రీమ్ కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో మూడు నెలల బకాయిలు ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలలో వేతనాలు ప్రతీ నెల 5వ తేదీలోపు చెల్లించాలి. మునిసిపల్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు సం.నకు 16 క్యాజువల్ లీవులు అమలు చేయాలి. సబ్బులు, చెప్పులు, కొబ్బరి నూనె, గ్లోజులు, జాడు కట్టలు తదితర పనిముట్లు సకాలంలో ఇవ్వాలి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయరాదు. ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ స్టాఫ్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ( ఎ.ఐ.టి.యు.సి. అనుబంధం ) కామారెడ్డి అధ్యక్షులు, మిర్జా అయాజ్ బేగ్,ప్రధాన కార్యదర్శి ఎన్. నర్సింగ్ రావు, కార్మికుల తదితరులు పాల్గొన్నారు.