బతుకమ్మ కుంటలో పేరుకుపోయిన చెత్తాచెదారం తీసి శుభ్రం చేసి మున్సిపల్ కార్మికులు..
-కార్యాలయం ముందు నిరసన తెలిపిన సిపిఎం
జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి వాకర్స్ కు దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరం ఆనందకరంగా ఉండే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మూకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మార్నింగ్ లో భాగంగా ఉదయం 6:30 గంటల నుండి 8 గంటల వరకు సిపిఎం కార్యకర్తలు బతుకమ్మ కుంటలో దుర్గమ్మ గుడి ఆవరణలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన విస్తారాకులు పాత బట్టలు చెత్త చెదారం తాగుబోతులు తాగి పడేసిన బ్రాండీ లిక్కర్ బీరు సీసాలను ఏరివేసి టాటా ఏసీ నిండా నింపి మున్సిపల్ కార్యాలయానికి తీసుకువెళ్లి కార్యాలయం ముందు చెత్త బండిని నిలబెట్టి నిరసన తెలపడం జరిగింది అనంతరం చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించారు.అక్కడికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ గోపయ్యకు జనగామ పట్టణంలో పేరుకుపోయిన చెత్త నిలువల గురించి తెలిపి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జనగామ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అందుకోసం మున్సిపల్ శానిటేషన్ కార్మికులను సిబ్బందిని పెంచి పట్టణ పౌరులకు మెరుగైన పౌర సేవలు అందించాలని అన్నారు.చెత్త నిలువల వల్ల దోమలు ఈగలు పెరుగుతున్నాయని దోమల బారినబడి డెంగీ జబ్బులు వచ్చి చనిపోయిన వారు అనేకమంది ఉన్నారని రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలై లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకొని ఆర్థికంగా నష్టపోయిన వారు కోకొల్లలు అని తెలిపారు. వారం రోజులలో జనగామ పట్టణాన్ని చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని లేకుంటే సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజలను సమీకరించి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి సేకరించిన చెత్తను మొత్తం మున్సిపాలిటీ ముందు ఉంచుతామని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి సీనియర్ నాయకులు ఎండి దస్తగిరి పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం పాము శ్రీకాంత్ పందిళ్ళ కళ్యాణి పల్లెర్ల లలిత పగిడిపల్లి బాలమణి సిపిఎం శాఖా కార్యదర్శులు కచ్చ గళ్ళ వెంకటేష్ ధరావత్ మహేందర్ నాయక్ జి సుధాకర్ భూనాద్రి వెంకటేష్ యండీ మైబేల్లి తదితరులు పాల్గొన్నారు….