రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ ఇరవై రెండు గెజిట్ చేసి అమలు చేయాలి*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 28 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో కే సి హెచ్ పి డీజిఎం వి మదన్ నాయక్ కి వినతి పత్రం అందజేసిన కాంట్రాక్ట్ కార్మికులు
పెహల్గాం అమరులకు నివాళులర్పించారు.
మేడే కానుకగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ ఇరవై రెండు గెజిట్ చేసి అమలు చేయాలనీ కోరుతూ సోమవారం నాడు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో కే సి హెచ్ పి డీజిఎం వి మదన్ నాయక్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వేతనాల పెంపుకై వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితనీ గొర్రె తోక బెత్తెడు అన్నట్లుగా వేతనాలు పెరగక నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశం అంటుతున్న నేటి తరుణంలో వేతనాల పెంపు అనివార్యం అని రేపు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ 22 గెజిట్ చేసి అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు శుభవార్త చెప్పాలని ఆయన కోరారు. అదేవిధంగా బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను, మక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ వర్కర్లను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు అమలు చేయాలి, సివిల్ మేస్త్రిలను స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి,ప్రతి నెల 7వ తేదీ కల్లా వేతనాలు చెల్లించాలి ,కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులందరికీ ఈఎస్ఐ వైద్య సౌకర్యం కల్పించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు పిఎఫ్ లెక్కలు చూపాలి పెండింగ్ పెన్షన్ అమలు చేయాలి రక్షణ పరికరాలు యూనిఫామ్ ఇప్పించాలి అదేవిధంగా రేపు అనగా మంగళవారం సాయంత్రం సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) మరియు హెచ్ఎంఎస్ సంయుక్త నిర్వహణలో నిర్వహించనున్న చలో జిఎం ఆఫీస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కాంట్రాక్ట్ కార్మికులను కోరారు. ఈ మేరకు ఏరియాలోని వివిధ గనులు డిపార్ట్మెంట్లలో విస్తృత ప్రచారం నిర్వహించినట్లు కూడా ఆయన తెలిపారు. కార్యక్రమానికి ముందు టెర్రరిస్టుల దాడిలో అమరులైన పెహల్గాం మృతులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్, సంజీవ రావు , ఆర్ లింగయ్య, తోడేటి వీర భద్రం, ,లక్ష్మీనారాయణ, నాగేష్, సాంబయ్య, ఆనంద్, చలపతి, కృష్ణ, వై వెంకన్న, జాన్, డేగల సతీష్, నాగేశ్వరరావు, ఏలియా, టీకియా, నరసింహారావు, వెంకటయ్య, అరుణ, శ్రీలత, దుర్గ మరియు రైల్వే కాంట్రాక్ట్ రైల్వే కార్మికులు కె రవికుమార్, కే గురుమూర్తి, కె వీర్రాజు, వి శంకర్, ఎం సాంబశివరావు, ఎం వెంకటేశ్వర్లు, ఐ గోపి, జి సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు
మేడే కానుకగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు శుభవార్త చెప్పాలి
by Naddi Sai
Published On: April 28, 2025 9:26 pm
