నాగన్నబావి పునరుద్ధరణ పనులు ప్రారంభం
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 20, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఇన్ఫోసిస్ సంస్థ, రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పునరుద్ధరణ చేయడంవల్ల భావితరాలకు పూర్వకాలం చరిత్ర తెలిసే వీలు కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, జిల్లా అధికారులు, ప్రతినిధులు కల్పన రమేష్ పాల్గొన్నారు.