నాగారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

*నాగారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక**

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం మే 10

ప్రెస్ క్లబ్ ఆఫ్ నాగారం నూతన కార్యవర్గం గురువారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఏర్పడింది. క్లబ్ ఆవరణలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో సీనియర్ పాత్రికేయుడు శివకుమార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బొడిగె రజినీకాంత్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించగా, సంతోష్ కుమార్, నరేష్ కుమార్ లు వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపికయ్యారు.

జాయింట్ సెక్రటరీలుగా బసవరెడ్డి, దినేష్ కుమార్ లు ఎన్నిక కాగా, గురుమూర్తి, బాలకిషన్ లు కోశాధికారులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పడిన కమిటీలో కరుణాకర్ గౌడ్, సాయికరణ్, నరసింహ, నరేష్ రెడ్డి, సతీష్ కుమార్, చిత్తారి రాజు సలహాదారులుగా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా శనివారం నాడు నూతన అధ్యక్షుడు, సెక్రటరీలను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. నూతన కమిటీ సభ్యులను పలువురు పాత్రికేయులు, శ్రేయోభిలాషులు హర్షాతిరేకాలతో అభినందించారు. రాబోయే రోజుల్లో ప్రెస్ క్లబ్ మరింత క్రియాశీలకంగా పని చేస్తుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment