నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు..

నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసులో దోషికి 51 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 51 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాదు.. 85 వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించాలని నల్గొండ జిల్లా కోర్టు ఆదేశించింది.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ఖయ్యూంకి ఈ కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. క్రైమ్ నం.242/2021, తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. (S.C. నం.94/2022)లో, తిప్పర్తి గ్రామం, మండలానికి చెందిన నిందితుడు ఖయ్యూంను ఎస్సీ ఎస్టీ కోర్ట్ జడ్జి రోజా రమణి దోషిగా తేల్చారు.

అత్యాచారానికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, ఫోక్సో చట్టం కింద మరో 20 సంవత్సరాల కారాగార శిక్ష, ఎస్సీ / ఎస్టి (సంబంధిత సెక్షన్) చట్టం కింద 10 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీటితో పాటు.. ఐపీసీ సెక్షన్ 506 కింద ఒక సంవత్సరం కారాగార శిక్షను కూడా విధించారు. బాధితురాలు.. 16 ఏళ్ల బాలిక ( ఎస్టి కమ్యూనిటీకి చెందిన అమ్మాయి).నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశా

Join WhatsApp

Join Now

Leave a Comment