విద్యార్థుల వినాయక భక్తికి అద్దం పట్టిన నారాయణ పాఠశాల

విద్యార్థుల వినాయక భక్తికి అద్దం పట్టిన నారాయణ పాఠశాల

ఆకట్టుకున్న గణేశుడి ప్రతిబింబం..!

ప్రశ్న ఆయుధం) నిజామాబాద్, సెప్టెంబర్ 4:

గణేశ్ చతుర్థికి విద్యార్థుల ప్రత్యేక నివాళి. వినాయకుడి ప్రతిబింబం ఆవిష్కరణ.

పాఠశాల యాజమాన్యం ప్రశంసలు.ఆర్మూర్: నగరంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు గణేశ్ నవరాత్రుల సందర్భంగా తమ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. గణనాథుడి 9వ రాత్రిని పురస్కరించుకుని, విద్యార్థులు కలిసికట్టుగా మానవ రూపంలో వినాయకుడి ప్రతిబింబాన్ని ఆవిష్కరించారు. వారి ఈ ప్రత్యేక ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఏజీఎం శివాజీ, ప్రధానోపాధ్యాయురాలు రజనీ కుమారి, వ్యాయామ ఉపాధ్యాయులు మోహన్, మీనాతో పాటు ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. వారి సృజనాత్మకత, భక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమం వినాయక చవితి పండుగకు మరింత శోభను తీసుకొచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment