నరేంద్ర మోడీ సుపరిపాలన దేశానికి శ్రీరామరక్ష

*నరేంద్ర మోడీ సుపరిపాలన దేశానికి శ్రీరామరక్ష*

*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి*

*జమ్మికుంట జూన్ 17 ప్రశ్న ఆయుధం*

నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన దేశానికి శ్రీరామరక్ష అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి అన్నారు మంగళవారం రోజున జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు అధ్యక్షతన జమ్మికుంట పట్టణంలోని 23వ వార్డు మురళి టాకీస్ దగ్గర మోడీ 11 ఏళ్ళ సంకల్ప సభ నిర్వహించారు సభకు హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల పాలనలో ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, కరోనా కాలం నుండి ఉచిత రేషన్ బియ్యం దేశ ప్రజలకు ఇస్తుందని, ఇప్పుడు రానున్న వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒకేసారి మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారని, దేశంలో పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకం కింద ఇళ్లు కట్టించి ఇస్తున్నారని, మన తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని తెలిపారు, రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు, దేశం, దేశ భద్రతకు తోలి ప్రాధాన్యత ఇస్తూ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేయడం కేవలం మోడీ కే సాధ్యామని ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా భారత రాజ్యాంగ వ్యవస్థలో పూర్తిగా భాగమైన జమ్మూ కాశ్మీర్,

ట్రిపుల్ తలాక్ రద్దు, పెద్ద నోట్ల రద్దు, మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా ద్వారా దేశంలో సరికొత్త ఇండస్ర్టీ పాలసీ తీసుకువచ్చి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాలు, అణు ఉత్పత్తి, ఆయుధాల తయారీ తో దేశానికి శ్రీరామరక్ష గా పరిపాలన సాగిస్తున్నారని కరోనా వాక్సిన్, అయోధ్య రామ మందిరం, బులెట్ ట్రైన్, వందే భారత్ రైల్లు, పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకం అందిస్తుందని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ పాహల్గామ్ లో భారతీయ హిందువులను మతం అడిగి మరీ చంపిన చర్యను యావత్ భారత దేశం ముక్తకంఠంతో ఖండించిందని, నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, వందల మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారని కేవలం ఒక ఆపరేషన్ సింధూర్ కే భయపడి పాకిస్థాన్ మన దేశ సైనికులతో కాల్పులు విరమణకు సహకరించాలని ప్రాధేయపడిందని గుర్తు చేశారు ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు ఎర్రబెల్లి సంపత్ రావు, గుర్రాల వెంకట్ రెడ్డి, ఆకుల రాజేందర్, శీలం శ్రీను, జీడి మల్లేష్, బచ్చు శివన్న, పల్లపు రవి, కైలాసకొటి గణేష్, మోడం రాజు, మోతె స్వామి, కొమ్ము అశోక్, బూరుగుపల్లి రాము, రాచపల్లి ప్రశాంత్, శ్రీవర్తి అఖిల్, యాంసాని సమ్మయ్య, నిరుపరాణి, కేస స్వరూప స్వరూప, కొండ్ర సులోచన, కనుమల్ల లక్ష్మి, రాంపెల్లి రజిత, తిరుమల, శోభ, అప్పాల రవిందర్, కురిమిల్ల అశోక్, కొండాపర్తి ప్రవీణ్, పొనగంటి రవి, ఉడుగుల మహేందర్, ముకుందా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment