కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్న నరేష్ బాబు దంపతులు

*ప్రతి ఇంటి నుండి భద్రాచల రామయ్యకు గోటి తలంబ్రాలు వెళ్ళాలి:*

*భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు*

IMG 20250303 191549
సిద్దిపేట, గజ్వేల్, మార్చి 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని భద్రాచల రామయ్య కళ్యానానికి మేము సిద్ధం అంటూ రామ నామస్మరణ గంటపాటు చేస్తూ గోటితో వడ్లను ఓలిచి రామభక్తిని చాటుకున్నాడు సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల నరేష్ బాబు దంపతులు. వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చి సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజుకు తన నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ.. మన చేతులతో ఓలిచి అందించే తలంబ్రాలు సాక్షాత్తు భద్రాచల సీతారాముల కళ్యానానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ గోటి తలంబ్రాలలో పాల్గొనాలని తెలిపారు. గ్రామ, గ్రామాన పంపిణికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Join WhatsApp

Join Now