Site icon PRASHNA AYUDHAM

ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాము….నార్నె శ్రీనివాస రావు 

IMG 20250509 WA2012

ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాము….నార్నె శ్రీనివాస రావు

ప్రశ్న ఆయుధం మే09: కూకట్‌పల్లి ప్రతినిధి

నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీ మూడవ లైన్ వద్ద మంజీర వాటర్ నీరు డ్రైనేజ్ తో కలసి అపరిశుభ్రంగా నీరు సరఫరా అవుతుండటం వల్ల త్రాగు నీరు సమస్య వస్తున్నందున, హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బి సిబ్బందితో కలసి పరిశీలించి, లీకేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, మంజీర వాటర్ నీరు డ్రైనేజ్ తో కలసి అపరిశుభ్రంగా నీరు సరఫరా అవుతుండటం వల్ల త్రాగు నీరు సమస్య వస్తున్నందున, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి సిబ్బందితో కలసి, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అధికారులను తీసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగింది అని, అలానే ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి డ్రైనేజ్ సూపర్వైజర్ నరేంద్ర, వాటర్ లైన్ మెన్ శ్రీకాంత్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version