నేటితో 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న   నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం.

నేటితో 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న   నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం .

 

ముఖ్య అతిథిగా హాజరైనా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్.

 

 

కామారెడ్డి జిల్లా .

 

(ప్రశ్న ఆయుధం ) ఆగస్టు 13.

 

మహిళలు, పిల్లలు వికలాంగుల మరియు వయో వృద్ధుల  సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భాగంగా మారక ద్రవ్య దుర్వినియోగం” యొక్క దుష్ప్రభావాలగురించి, సామూహిక అవగాహన కల్పించే లక్ష్యంతో, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) ను అమలు చేస్తుంది.

 

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమ ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, విద్యార్థులు, యువత , మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆగష్టు 13వ తేదీతో 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ఈ రోజు ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కాలేజీ కామారెడ్డి పట్టణంలో సాముహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ భవిష్యత్ ను సక్రమమైన దారిలో నిర్మిచుకోవాలని సూచించారు. అదే విధంగా చాలా మంది యువకులు మాధక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని  ప్రభుత్వం మాధక ద్రవ్యాలను వినియోగం కట్టడి చేయడం కొసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. అదే విధంగా జిల్లాలో మాధక ద్రవ్యాలను వినియోగం తగ్గించడానికి జిల్లా సంక్షేమ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ , జిల్లా సంక్షేమ ఆధికారి ప్రమీల, ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంత రావు, డిగ్రీ కళాశాల విద్యార్థిని , విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now