*జాతీయ డెంగ్యూ దినోత్సవం అవగాహన ర్యాలీ*
*జమ్మికుంట మే 16 ప్రశ్న ఆయుధం*
జ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుందనీ తెలిపారు. దోమలను వాటిని తరిమేయాలనీ ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడాలన్నారు చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలనీ సూచించారు దోమలను పారదోలే మందులను ఉపయోగించాలనీ సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలన్నారు.
ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలని పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలనీ పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలనీ సూచించారు పూలకుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలనీ తాజా నీటిని కూడా కాచి చల్లార్చి సేవించాలని నీటి ద్వారే ఎక్కువ సమస్యలు వస్తుంటాయని శుద్ధమైన నీటినే తాగాలి అని ప్రజలకు సూచించారు.ఈ అవగాహన ర్యాలీలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్లు ఫర్హానుద్దీన్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సంధ్య, డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్,డాక్టర్ హిమబిందు,డాక్టర్ విజయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సూపర్వైజర్లు రత్నకుమారి,అరుణ,కుసుమ కుమారి,సదానందం ఆరోగ్య శాఖ సిబ్బంది నరేందర్,సరళ, వనజ,మంజుల,సాజిదా పర్వీన్,వాణి,రజిత,రాధ ఆశాలు తదితరులు పాల్గొన్నారు.