పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 29కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
పివి కాలనీలో ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
విశిష్ట అతిథిగా ఏరియా జిఎం దుర్గం రామచందర్
మత సామరస్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో కుల మతాలకతీతంగా దేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి తెల్లవారిపై పోరాడిన ఫలితంగానే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని మరలా అంతటి ఐక్యత ప్రదర్శిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మత సామరస్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఏరియా ప్రాతినిధ్య సంఘం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) ఆధ్వర్యంలో బొంబాయి కాలనీ (పివి కాలనీ) మహమ్మదీయ మసీదులో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన రంజాన్ మాసం ఉపవాస దీక్ష విరమణ ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు ప్రత్యేకించి ముస్లిం సోదరులకు అందజేస్తున్న పలు రకాల ప్రోత్సాహకలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో అండగా ఉందన్నారు. ముస్లిం సోదరులు కూడా అటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నారన్నారు.అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వారి కుటుంబ సభ్యులకు ముందస్తు ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పీవీ కాలనీ ముస్లిం షాది ఖానా నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో భవన నిర్మాణం ప్రారంభమైందని అందుకు కృతజ్ఞతాభావంతో ముస్లిం సోదరులు ఎమ్మెల్యే గారిని, విశిష్ట అతిధి ఏరియా జిఎం దుర్గం రామచందర్ గారిని అధికారులతో కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు . ముస్లిం మత పెద్దలు షేక్ అబ్దుల్ రవూఫ్ అధ్యక్షత వహించగా ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి శ్యాంసుందర్, ఏజీఎం సివిల్ ధనసరి వెంకటేశ్వర్లు, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నయ్య త్యాగ రాజన్ ,ఏరియా ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు, సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్ రవూఫ్, ఎండి షాబుద్దీన్,సూరపాక రాములు, మిద్దెపాక శ్రీనివాస్, మల్లికార్జున్, బుర్ర వెంకటేశ్వర్లు, బొడ్డుసంతోష్ చరణ్, రామకృష్ణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు పిరినాకి నవీన్, సామా శ్రీనివాసరెడ్డి, పూనేo శేఖర్, గాండ్ల సురేష్, రహీం, జీవరత్నం కూచిపూడి బాబు, గణేష్ రెడ్డి,ముస్లిం మత పెద్దలు ఎండి హబీబ్, ఎండి అమీనుద్దీన్, షేక్ కుద్దూస్, పర్వేజ్,ఇస్మాయిల్, ఇమామ్,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.