భావి తరాలకు ఆదర్శం ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
విశ్వామిత్ర చౌహాన్ తో కలిసి మొక్కను నాటిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, సీఐ రాయల వెంకటేశ్వర్లు
సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేస్తున్న చిన్నారి మూడు విశ్వామిత్ర చౌహన్ టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, సీఐ రాయల వెంకటేశ్వర్లు లతో కలిసి లక్ష్మిదేవిపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ చిన్న వయసులోనే మొక్కలు నాటడం అభినందనీయమని ప్రస్తుతం మారుతున్న కాలంలో చెట్లను పెంచే ఆవశ్యకత ఎంతైనా ఉందని పరిశ్రమలు బాగా పెరుగుతున్నందున అందులో నుండి వచ్చే పొగ వలన కాలుష్యం జరగకుండా ఓజోన్ పొర దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ చిన్నారి విశ్వామిత్ర చౌహన్ ను ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి రక్షణ అని అన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్థి ఆరోగ్యవంతమైన సమాజమని అవి చెట్ల పెంపకం వలనే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ టౌన్ అధ్యక్షులు జయప్రకాశ్, బొబ్బల వెంకట్ యాదవ్, బొల్లం ఉదయ్ కుమార్ యాదవ్, వీరబాబు, సాగర్, బొబ్బల గణేష్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now