తల్లి సహకారంతో టీచర్ ఉద్యోగం సాధించిన నవీన్

తండ్రి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినా తల్లి సహకారంతో టీచర్ ఉద్యోగం సాధించిన యువకుడు..

 

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్  

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 11:

 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన గాండ్ల నవీన్ కష్టపడి చదివి డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన సదాశివ నగర్ మాజీ జెడ్పిటిసి పడిగల రాజేశ్వరరావు, గాంధారి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సర్వపూర్ సత్యం రావు తో కలిసి శుక్రవారం ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన నవీన్ పుట్టిన కొద్ది రోజులకే తండ్రి మిలటెంట్ గా పనిచేసి దళం కలవడానికి వెళ్లి సంగోజిపేట ఎన్కౌంటర్‌లో మృతి చెందాడు ఆనాటి నుంచి తల్లి కూలినాలి చేసి కొడుకును ప్రయోజకునిగా చేయాలని పట్టుదలతో ప్రోత్సహించగా నవీన్ ఉపాధ్యాయ పోస్టు అందుకోగలిగాడు తల్లి గంగవ్వ ప్రోత్సాహంతో పాటు పట్టుదలగా చదివి తన కుటుంబానికి సమాజానికి సేవ చేయాలని సంకల్పంతో రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఉపాధ్యాయునిగా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు యువకున్ని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో పద్మాజివాడి పాల కేంద్రం అధ్యక్షుడు ఎర్రవటి గంగారెడ్డి , మాలిష్ భూమ్‌రావు, ముడేగామ గంగారెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now