నక్సలైట్లు ల్యాండ్‌మైన్ దాడిలో వీర మరణం పొందిన జవాన్‌కు ఘన నివాళి

**నక్సలైట్లు ల్యాండ్‌మైన్ దాడిలో వీర మరణం పొందిన జవాన్‌కు ఘన నివాళి**

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రశ్న ఆయుధం మే 9

IMG 20250509 WA2185

నక్సలైట్లు పేల్చిన ల్యాండ్‌మైన్ దాడిలో వీర మరణం పొందిన సీఆర్‌పీఎఫ్ ఏఆర్ జవాన్, ఘట్కేసర్‌కు చెందిన ముద్దు బిడ్డ తిక్క సందీప్ (ఎస్/ఓ తిక్క అశోక్) భౌతిక కాయానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రి మరియు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం రోజున మేడ్చల్‌లో నిర్వహించిన అంతిమయాత్రలో నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కూడా పాల్గొని పుష్పాంజలి ఘటించారు. వీర జవాన్ తిక్క సందీప్‌కు శ్రద్ధాంజలి అర్పించిన అనంతరం, మంత్రి శ్రీధర్ బాబు మరియు ఇతర నాయకులు సందీప్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “జవాన్ సందీప్ త్యాగం వెలకట్టలేనిది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల ధైర్యం మనందరికీ స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment