ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ సిసి సెలక్షన్స్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 19, కామారెడ్డి :

డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న 58 మంది విద్యార్థులను ఎన్సిసి కొరకు ఎంపిక చేసినట్లు ఎన్ సి సి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఏ సుధాకర్ తెలిపారు. పరుగు పందెం, వ్రాత పరీక్ష ఆధారంగా 12వ బెటాలియన్ కు చెందిన ఆర్మీ అధికారులు నాయబ్ సుబేదార్ హరి ప్రీత్ సింగ్, హవల్దార్ గుర్జిత్ సింగ్ ఎంపిక చేసినట్లు లెఫ్ట్నెంట్ డాక్టర్ ఎస్ సుధాకర్ తెలిపారు. ఈ పరుగు పందెమును కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య జండా ఊపి ప్రారంభించారు. ఈ ఎంపికలో కళాశాల తెలుగు అధ్యాపకులు విశ్వ ప్రసాద్, ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now