మున్సిపాలిటీ కార్మికులకు కనీస వేతనంగా 26 వేల రూపాయలు చెల్లించాలి.
….. నీరటి మల్లేష్
రాజేంద్రనగర్ ,జనవరి 04
శంషాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రుద్ర కుమార్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నీరటి మల్లేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికులకు కనీస వేతనం 26000 చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు. అలాగే కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. పక్క రాష్ట్రంలో ఆంధ్రలో మున్సిపాలిటీ కార్మికులకు ఇస్తున్న ఇరవై ఒక్క వేల రూపాయలను వేతనం మన తెలంగాణలో కూడా ప్రస్తుతం చెల్లించాలని అన్నారు.లేదంటే రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు డి నాగేష్,జిల్లా కమిటీ సభ్యుడు జయేందర్ మున్సిపాలిటీ మండల అధ్యక్షుడు టి ప్రవీణ్, యాదమ్మ,ఇందిరా, సుజాత, రావేలా,శీను, సత్తయ్య, రవి, అరుణ్,దశరథ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.