నీట్‌ పీజీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్షల పూర్తి షెడ్యూల్

NEET PG 2025 Application: నీట్‌ పీజీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్షల పూర్తి షెడ్యూల్

దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్‌ పీజీ (పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నీట్‌ పీజీ పరీక్షను జూన్‌ 15వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.

మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3.30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌)-పీజీ 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌ డిగ్రీ లేదా ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మే 7, 2025వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

– ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 07, 2025.

– దరఖాస్తు సవరణ తేదీలు: మే 9 నుంచి 13 వరకు.

– సిటీ ఇంటిమేషన్‌ వివరాలు విడుదల తేదీ: జూన్‌ 2

– అడ్మిట్‌ కార్డులు విడుదల: జూన్‌ 11, 2025.

– నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ: జూన్‌ 15, 2025.

– ఫలితాల వెల్లడి తేదీ: జులై 15, 2025.

Join WhatsApp

Join Now