ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 23
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా మంజూరైన అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కొత్తగా చెవి, ముక్కు, గొంతు, దంత, కంటి మరియు ఎముకలు కీళ్ళ విభాగాలలో ఓపిడి మరియు సర్జరీ కి సంబంధించిన పరికరాలు ఇటీవలే స్థానిక ఎం.ఎల్.ఎ గారి చేతుల మీదుగా ప్రారంభించబడి అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మోకాళ్ళ కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స కానీ మరే ఇతర విరిగిన ఎముకలు మరియు కీళ్ళ కు సంబంధించిన శస్త్రచికిత్స చేయబడును. అలాగే కంటికి సంబంధించిన పూర్తి స్థాయి ఓపీ చూడబడును మరియు అన్ని రకాల వైద్య పరీక్షలు ,చెవి, ముక్కు, గొంతు సంబంధించిన ఓపీ మరియు గొంతు, ముక్కు సంబంధించిన ఆపరేషన్లు దంత విభాగానికి సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.