నూతన ప్లైఓవర్ ప్రారంభోత్సవం

*నూతన ప్లైఓవర్ ప్రారంభోత్సవం*

*ప్రశ్న ఆయుధం,జూన్ 28,శేరిలింగంపల్లి,ప్రతినిధి*

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి డివిజన్ లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ నుండి శిల్ప లేఔట్ స్టేజ్ 2కొండాపూర్ వైపు ఎస్ ఆర్ డీ పీ. కింద రూ.182.72 కోట్లరూపాయల అంచనా వ్యయంతో 1.2కి.మీ పొడవు 24మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ లతో ఉన్న బైడైరెక్షనల్ పీజేఆర్ ప్లైఓవర్ ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శిలాఫలాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేమ్ నరేందర్ రెడ్డి, చీఫ్ విప్. పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు. అనిల్ కుమార్ యాదవ్, ఎంబీసీ ఛైర్మెన్ జెరిపేటి జైపాల్ మాజీ ఎమ్మెల్సీదయాకర్, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్, జిహెచ్ఎంసీ కమీషనర్ కర్ణన్, శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ హేమంత్, డిప్యూటీ కమీషనర్ శ్రీమతి ప్రశాంతి, శేరిలింగంపల్లి నియోజకవర్గం తదితర డివిజన్ ల కార్పొరేటర్లతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ప్లైఓవర్ కు స్వర్గీయ జననేత పీ. జనార్దన్ రెడ్డి నామకరణం చేసినందుకు ఎంతో సంతోషమని అన్నారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని, గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుందని ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తదితర డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment