మెదక్ ఎంపీని కలిసిన బీజేపీ నూతన అధ్యక్షులు

మెదక్ ఎంపీని కలిసిన బీజేపీ నూతన అధ్యక్షులు

గజ్వేల్ నియోజకవర్గం, 16 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం, పట్టణ, మండలాల బిజెపి నూతన అధ్యక్షులను ఇటీవల రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నూతన అధ్యక్షులు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతన అధ్యక్షులను శాలువాతో సత్కరించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగాలని నూతన అధ్యక్షులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల బిజెపి అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, కూకునూర్ పల్లి మండల బిజెపి అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి, కొండపాక మండల బిజెపి అధ్యక్షులు నీల సత్యం ముదిరాజ్, తూఫ్రాన్ పట్టణ బిజెపి అధ్యక్షులు జానకిరామ్ గౌడ్, మనోహరాబాద్ మండల బిజెపి అధ్యక్షులు బక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now