Site icon PRASHNA AYUDHAM

నూతన బోర్ వేయించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

IMG 20240919 WA0269

నూతన బోర్ వేయించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 19, కామారెడ్డి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సూచన మేరకు కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్ 9వ వార్డు కౌన్సిలర్ నీటి సమస్య ఉందని మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి గురువారం బోర్ వేయించారు. నీటి సమస్య తీర్చడానికి మున్సిపల్ చైర్మన్ కొబ్బరి కాయ కొట్టి బోర్ ప్రారంభించారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ… చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడిన వారిమవుతామని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు నీటిగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పడిగే సుగుణ, పాత శివ కృష్ణమూర్తి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version