*_రేపే రేవంత్ మంత్రివర్గ విస్తరణ.._*
*_కొత్తగా వీరికే ఛాన్స్- ఇద్దరు ఔట్..?_*
*_విజయశాంతి, అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..?_*
ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కొంత కాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఢిల్లీలోనూ కసరత్తు జరిగింది. సామాజిక సమీకరణాల సమతుల్యత పేరుతా వాయిదా పడుతూ వచ్చింది.
అయితే, ఇప్పుడు ఏఐసీసీ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్ల జాబితాకు ఢిల్లీ ఆమోద ముద్ర వేసింది. శాఖల్లోనూ మార్పులు ఖాయమయ్యాయి.
ఆదివారం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారైంది. ముగ్గురు లేదా నలుగురు వరకు చోటుండే అవకాశం ఉంది.
తొలుత ఐదుగురు వరకు ఛాన్స్ ఉంటుందని భావించినా.. ముగ్గురి పేర్లకు ఇప్పటి వరకు ఆమోదం లభించింది.
ఆషాఢ మాసము ప్రారంభం అవుతుండటం తో విస్తరణ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ కోరారు. దీనికి ఏఐసీసీ ఆమోదం తెలపటంతో ఆదివారం విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది.
ఇక.. మంత్రివర్గంలో ఒకరిద్దరికి స్థానచలనం తప్పదనే చర్చ వినిపిస్తోంది. మంత్రులుగా తొలిగించిన వారికి పార్టీలో బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురైన మంత్రితో పాటుగా.. మరో మంత్రి పేరు తెర మీదకు వస్తోంది._
కాగా, సామాజిక సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న విజయశాంతికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది.
*_నల్గొండ జిల్లాకు చెందిన రేవంత్ సన్నిహిత నేత అద్దంకి దయాకర్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు రేసులో ఉండగా.. ఇప్పుడు దయాకర్ పేరు తెర మీదకు వచ్చింది.
దీంతో, ఈ ఇద్దరిలో చివరికి ఎవరికి అవకాశం దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.