తమిళ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో భాగంగా, సంగీత 250 కోట్ల రూపాయల భరణం కోరగా, విజయ్ 35 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం.
విజయ్ భార్య సంగీత, 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె తన పిటిషన్లో, నటి త్రిషతో విజయ్ సహజీవనం చేస్తున్నారని, వివాహేతర సంబంధం, శారీరక క్రూరత్వం వంటి కారణాలతో విడాకులు కోరుతున్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కోర్టులో విజయ్ తరపున, తన భార్య సంగీతకు 35 కోట్ల రూపాయల భరణం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పిల్లల బాధ్యతను కూడా తానే తీసుకుంటానని తెలిపారు. అయితే, సంగీత 250 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని భరణంగా డిమాండ్ చేయడం కేసును సంక్లిష్టంగా మార్చింది.
ఈ విడాకుల కేసు తన రాజకీయ జీవితానికి కూడా అడ్డంకిగా మారిందని విజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కావాలనే తన లక్ష్యాన్ని అడ్డుకునేందుకు సంగీత కుట్రలు పన్నుతోందని, ఎన్నికల్లో తనను ఓడించేందుకే ఈ చర్యలకు పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు. తన ఎన్నికల అఫిడవిట్లో 605 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్న విజయ్, తన భార్య, పిల్లల పేరిట ఎలాంటి ఆస్తులు లేవని తెలిపారు.
కేసు తుది తీర్పు వచ్చేవరకు తనను ఇంట్లోనే ఉండనివ్వాలని సంగీత కోర్టులో అభ్యర్థించారు. గత రెండేళ్లుగా ఈ దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలు కూడా సంగీత వద్దే ఉంటున్నారు.











