Site icon PRASHNA AYUDHAM

నిమ్మలగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు

IMG 20250609 WA0243

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 9 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలలోనే చేర్పించిని ప్రచారం నిర్వహించారు.
నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కార్యక్రమాన్ని చేపట్టారు.బడి ఈడు పిల్లలందరినీ అనగా ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఆదర్శ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో మరియు అపరిమిత మేధావి అపర చాణక్యుడు అయిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారధ్యంలో మన రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి గా పరుగులు తీస్తున్నదని అందుకే విద్యారంగానికి బడ్జెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి, పాఠశాలలో అన్ని మౌలిక వసతుల రూపకల్పనతోపాటు,
ఉదయం పూట పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలు, ఉచిత యూనిఫాం, మరియు ఆంగ్ల భాషలోనే బోధన తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ,పేద ప్రజలందరికీ ఉత్తమ విద్యను అందించడానికి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తున్నదని అందువలన బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. సిబ్బంద సహ ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్,అంగన్వాడీ టీచర్ ప్రమీల, పాఠశాల వంట ఏజెన్సీరజిత, తల్లిదండ్రులు ప్రియాంక, లక్ష్మి ,శ్రీనివాస్, శంకర్, గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version