Site icon PRASHNA AYUDHAM

కొందరి చేతుల్లోనే సంపద ఉండకూడదు: నితిన్ గడ్కరీ..!!

IMG 20250706 135153

కొందరి చేతుల్లోనే సంపద ఉండకూడదు: నితిన్ గడ్కరీ..

దేశంలో సంపద వికేంద్రీకరణ జరగాలన్న గడ్కరీ

ఇది అత్యవసరమని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి

నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు

వ్యవసాయం, తయారీ రంగాలపైనా ప్రస్తావన

మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంపై చర్చ

దేశంలో సంపద వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా చూడాలని, అది అందరికీ చేరేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం, తయారీ పరిశ్రమల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. అదేవిధంగా, పన్నుల విధానం, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) వంటి విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ అంశాలపై చర్చిస్తూనే, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సంపద వికేంద్రీకరణే సరైన మార్గమని ఆయన సూచించారు. దేశంలో పేదలు పెరుగుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడుతోందని వ్యాఖ్యానించారు.

Exit mobile version