🔹బ్రహ్మోత్సవాల కోసం బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షణ
భీంగల్, సెప్టెంబరు 20 (ప్రశ్న ఆయుధం)
లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో, ఈ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రాబోయే జాతర ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలుపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
కమిషనర్ ఇచ్చిన ముఖ్య సూచనలు:
🔹 ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ రూపొందించాలి
🔹 పార్కింగ్ ప్రాంతాలు ముందుగానే గుర్తించాలి
🔹 తాగునీరు, వైద్య సేవలు, లైటింగ్ వంటి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ
🔹 పోలీస్ సిబ్బంది భక్తులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి
🔹 భద్రతను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలి
🔹 పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ, స్థానిక సంస్థల మధ్య సమన్వయం అవసరం
ఈ పర్యటనలో భీంగల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై సందీప్, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.