ఎన్ ఎన్ రెడ్డి టెక్స్ టైల్స్ మెయిన్స్ బోటిక్ ఆధ్వర్యంలో శ్రీవారి చలివేంద్రం ప్రారంభోత్సవం…. బేరి రామచందర్ యాదవ్
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 24: శేరిలింగంపల్లి ప్రతినిధి
శేరిలింగంపల్లి బాపూనగర్ ఎన్.ఎన్.రెడ్డి టెక్స్టైల్స్ మెయిన్స్ బోటిక్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీవారి చలివేంద్రం కార్యక్రమం నిర్వహిస్తారు.ఈ చలివేంద్ర ప్రారంభోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు ఎన్ ఎన్ రెడ్డి టెక్స్టైల్స్ ప్రోపరేటర్ కుశల్ సింహారెడ్డి వారి స్టాంప్ మౌలానా , నర్సింగ్ రావు మరియు నేతాజీ నగర్ కాలనీవాసులు కె నరసింహ యాదవ్ , బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాయన్న ముదిరాజ్ , సూర్య చంద్ర రెడ్డి మరియు ఎక్సైడ్ బ్యాటరీ సర్వర్ కపిల్ చిట్ఫండ్ గ్రూప్ ఆఫ్ మేనేజర్స్ యాదవ్ రెడ్డి మొర్రి సత్తయ్య, అశోక్, రమేష్, దేవేందర్, కృష్ణ, ఓంకార్, రాఘవేందర్, రాజ్ కుమార్, కిషన్, కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రాణకోటికి నీరే ఆధారం నీరు లేనిదే జీవం లేదు.మంటల మండుతున్న ఎండల్లో బాటసారులకు తాగునీరు అందిస్తున్నటువంటి కుశలసింహారెడ్డి కి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ దాన గుణం కలిగి ఉండాలి అని అన్నారు.ప్రతి యేటా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో మంది దాహార్తిని తీరుస్తూ వారి నుంచి ఆశీస్సులు అందుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించాలని మీకు ఈ అద్భుత కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకుగాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సకల కోటి జీవులకు ఆహారం వేరు కావచ్చు కానీ దాహానికి మాత్రం నీరు కావాలి. అట్టి నీరును వృధా చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదని అన్నారు.