Site icon PRASHNA AYUDHAM

ఇద్దరు నిందితులు కోర్టు వాయిదాలకు గైర్హాజరు అవ్వడం వల్ల నాన్ బైలబుల్ వారెంట్

IMG 20250107 WA0355

: సుజాతనగర్ ఎస్సై రమాదేవి

ప్రశ్న ఆయుధం జనవరి 7 సుజాతనగర్ మండల ప్రతినిధి ఎస్.కె. అజ్జు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసి కొత్తగూడెం కోర్టులో హాజరు పరిచి భద్రాచలం సబ్ జైలుకి తరలించడం జరిగింది.
07.01.2025 నాడు Cr. No: 76/2018 u/s 353 IPC, గల కేసులో ముద్దాయి అయినటువంటి గుగులోతు అరుణ మంగపేట నివాసి,Cr. No: 62/2019 u/s 452, 354, 506 IPC గల కేసులొ ముద్దాయి అయినటువంటి భూక్య తరుణ్ ఒడ్డుగూడెం తండా నివాసి, పైన తెలిపిన ముద్దాయిలు కోర్టువాయిదాలకు హాజరు అవ్వకుండా కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి గైర్హాజరు అయినందుకు, సుజాతనగర్ ఎస్ఐ మాలోత్ రమాదేవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా పైన తెలిపి నటువంటి నిందితులను ఈరోజు అదుపులో తీసుకొని కొత్తగూడెం కోర్టు నందు హాజరు పరిచి భద్రాచలం సబ్ జైలుకు తరలించనైనది. సుజాతనగర్ మండల ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి, కోర్టు ఉత్తర్వులను తుచా తప్పకుండా పాటిస్తూ వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరు అవ్వవలసిందిగా సుజాతనగర్ ఎస్సై రమాదేవి తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version