నన్నెవరూ గాంధీ భవన్కి పిలవలేదు
పీసీసీ చీఫ్ పై అభిమానంతోనే గాంధీ భవన్కు వచ్చి జరుగుతున్న విషయాలను వివరించాను
కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయి
కొండా సురేఖకు, సీతక్కకి గ్యాప్ ఉందని కడియం ప్రచారం చేశాడు
పరకాల పూర్తిగా మాదే
రేవూరికి నిస్వార్ధంగా సహాయం చేశాం.. అతనిప్పుడు మాపై గుడుపుటాని రాజకీయాలు చేస్తున్నారు
మా మద్దతుతోనే రేవూరి గెలిచాడు
నాయిని రాజేందర్ రెడ్డి పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తున్నాడు
నాయిని తనకు సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నాడు
కడియం శ్రీహరి ఇందిరకు చుక్కలు చూపిస్తున్నాడు
స్టేషన్ ఘనపూర్లో ఇందిర అనుచరులను టార్చర్ చేస్తున్నాడు
వేం నరేందర్ రెడ్డి సీటు ఎగిరిపోవడానికి నేనే కారణమని నాపై కోపంగా ఉన్నట్టున్నాడు
నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చాను
పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లను తీసుకువచ్చా
కొంతమంది లాగా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడం లేదు
ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని నేను – కొండా మురళి