తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 14, హైదరాబాద్:

తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.
బీఆర్‌ఎస్‌ సభ్యుడు కె.కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ లను స్వీకరించనున్నారు.

ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Join WhatsApp

Join Now