ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఇతర సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు.
ఐ ఎఫ్ టియు అనుబంధ గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా తెలియజేశారు.
సింగరేణి వ్యాప్తంగా నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులకు సెంట్రల్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఐ ఎఫ్ టియు అనుబంధ గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. శుక్రవారం సాయంత్రం పివి కాలనీ సింగరేణి నర్సరీలో పనిచేస్తున్న నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులతో పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న అనంతరం వారితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి నర్సరీ కాంటాక్ట్ కార్మికులకు సెంట్రల్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని 8.33% బోనస్ ఇటీవల అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించిన ప్రత్యేక ప్రోత్సాహక నజరానా ఐదువేల రూపాయలు కూడా చెల్లించాలని, సి ఎం పి ఎఫ్ స్కీం అమలు చేయాలని సింగరేణి ఉచిత వైద్య సౌకర్యానికై మెడికల్ అటెండెన్స్ బుక్కులు ఇవ్వాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులు ఏ ఇందిర, ఆర్ రేణుక, బి లక్ష్మి, ఎం దేవి, ఈ రాజేశ్వరి, పీ వెంకటమ్మ, ఎస్ కె షాహిన్ ,బి కుమారి ,ఆర్ సాంబయ్య, కవిత, త్రివేణి, మణెమ్మ, యాదమణి, మల్లమ్మ ,రాజకుమారి, శ్రీదేవి, రమణ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి వ్యాప్తంగా నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులకు సెంట్రల్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి
