ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
30వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి . పాటిల్ తెలియజేశారు. ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.

Join WhatsApp

Join Now