Site icon PRASHNA AYUDHAM

పైప్ లైన్ లీకేజీ పట్టించుకోని అధికారులు

IMG 20250624 WA1643

*పైప్ లైన్ లీకేజీ పట్టించుకోని అధికారులు*

*నిత్యం చూస్తున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది*

*కలుషిత నీటితో ప్రజలు ఇబ్బంది పాలు*

*చెరువును తలపిస్తున్న ఎంపీడీవో ఎంఈఓ హై స్కూల్ రహదారి*

*సిపిఎం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రాములు రత్నాకర్*

*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 24 ప్రశ్న ఆయుధం*

అనునిత్యం మండల ఉన్నత అధికారులు ప్రయాణించే రహదారిలో పైపు లీకేజీ అయినా పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు పైపులైను లీకేజీ తో మండల కేంద్రంలోని ఎంపీడీవో ఎంఈఓ హై స్కూల్ రహదారి చెరువును తలపిస్తున్న ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పట్ల మంగళవారం రోజున సిపిఎం సిపిఐ పార్టీల మండల కార్యదర్శులు చెల్పూరి రాము రత్నాకర్ లు మాట్లాడుతూ రోజురోజుకు అభివృద్ధి చెందే మండలం గా ఉండవలసిన ఇల్లందకుంటలో అధికారుల నిర్లక్ష్యంతో చెరువును తలపిస్తున్న ఎంపీడీవో ఎంఈఓ హైస్కూలు రహదారి అని పేర్కొన్నారు పైపులైను లీకేజీ తో రహదారి పైన గుంత ఏర్పడి అది చెరువును తలపించే విధంగా ఉందని ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోవలసిన అధికారులు గాలికి వదిలేయడంతో ప్రజలు తాగే మంచినీరు లీకేజ్ ల ద్వారా మురుగునీరుగా పైపుల ద్వారా రావడం జరుగుతుందని నిత్యం ఈ రహదారి వెంబడి మండల ఉన్నత అధికారులు విద్యార్థిని ,విద్యార్థులు, గ్రామ ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారని గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని ప్రజలు బాగుండాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని గొప్పగా చెప్పే అధికారులకు ఈ రహదారి వెంబడి లీకేజీ కనిపించడం లేదా అని తక్షణమే జిల్లా కలెక్టర్ ,ఉన్నత అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ పైపులను లీకేజీ మరమ్మతులు చేసి రహదారికి మరమ్మతులు చేయాలని లేనియెడల ప్రజలను కలుపుకొని ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామవాసులు కాలనీవాసులు పాల్గొన్నారు.

Exit mobile version