కామారెడ్డిలో ఒలంపిక్ డే రన్ – 2025 ఘనంగా నిర్వహణ
ప్రశ్న ఆయుధం కామారెడ్డి 19జూన్
తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఆదేశాల మేరకు, కామారెడ్డి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఒలంపిక్ డే రన్ – 2025ను గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కమిటీ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్, కన్వీనర్ నల్లవెల్లి కరుణాకర్, కో-కన్వీనర్ రంగా వెంకటేశ్వర్ నేతృత్వంలో నిర్వహించారు.
రన్ కార్యక్రమం స్థానిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమై, నిజాంసాగర్ – కొత్త బస్టాండ్ మీదుగా సాగి, ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ముగిసింది. ముందస్తుగా రూట్ మ్యాప్ను సిద్ధం చేసి పరుగు సురక్షితంగా నిర్వహించారు.
పరుగు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా , ఏసీపీ చైతన్య రెడ్డి, ఆర్ డి ఓ.వీణ, డి ఇ ఓ. ఎన్. రాజు, జగన్నాథం, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, పండ్ల రాజు, గుడుగుల శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, , వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ పరుగు రన్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో, పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం ద్వారా యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచుతూ, ఆరోగ్య పరిరక్షణకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఉన్నదని కమిటీ కన్వీనర్లు కరుణాకర్ రెడ్డి, రంగా వెంకటేశ్వర్ లు తెలిపారు.