కామారెడ్డిలో ఒలింపిక్ డే రన్ – 2025 ఘనంగా నిర్వహణకు సిద్ధం-కర్ణాకర్ రెడ్డి
కామారెడ్డి, జూన్ 17:
జిల్లాలో ఒలింపిక్ డే రన్ – 2025ను జూన్ 19వ తేదీన బుధవారం రోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, జిల్లా ఒలింపిక్ డే రన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.ఈ రన్ ఉదయం 8:30 గంటలకు కామారెడ్డి పట్టణంలోని ZPHS బాయ్స్ హై స్కూల్ ప్రాంగణం నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం ఇది ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగుతుంది.కార్యక్రమంలో జిల్లాలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ సంఘాల సభ్యులు, విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, వాకర్స్ అసోసియేషన్ తో పాటు ఇతర సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
ఈ రన్ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యంగా ముందుకు రావాలని, కార్యక్రమ కన్వీనర్ శ్రీ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి కోరారు.