Site icon PRASHNA AYUDHAM

ఈనెల 8 న తెరసం పదేండ్ల సభలు కరపత్రాల ఆవిష్కరణ

IMG 20241206 WA0626

ఈనెల 8 న తెరసం పదేండ్ల సభలు కరపత్రాల ఆవిష్కరణ

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 06, కామారెడ్డి :

తెలంగాణ రచయితల సంఘం పదేండ్ల సాహిత్య సభలకు సంబంధించిన కరపత్రాలను తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య ఆస్తిత్వం చైతన్యం కోసం ఏర్పడ్డ తెలంగాణ రచయితల సంఘం ఆ దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహించి, పుస్తకాలు ప్రచురించి, సాహిత్య కార్యాలశాలలు నిర్వహించిందన్నారు.
తెరసం స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 8న హైదరాబాదులోని రవీంద్రభారతిలో పదేండ్ల సాహిత్య సభలు నిర్వహిస్తారన్నారు. సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కవులు మోత్కూరి అశోక్ కుమార్, సిహెచ్ ప్రకాశ్, సిరిగాద శంకర్, వై. సాయిలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version