Site icon PRASHNA AYUDHAM

వంద పడకల ఆసుపత్రి స్థలం అప్పగింత…

IMG 20250627 WA0039

వంద పడకల ఆసుపత్రి స్థలం అప్పగింత…

ప్రశ్న ఆయుధం జూన్27: కూకట్‌పల్లి ప్రతినిధి

ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు వినతికి స్పందించిన నూతన కలెక్టర్ ….

కెపిహెచ్‌బి కాలనీలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని ఎట్టకేలకు ఆరోగ్య శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం నుంచి హౌసింగ్ బోర్డు పరిధిలోని ఆసుపత్రి స్థలాల్ని స్వాధీనం చేసుకోవాలని, ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక కూకట్పల్లి ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు పలుమార్లు ఆరోగ్య శాఖ అధికారులను, జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మను చౌదరిని గత గురువారం కూకట్పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లతో కలిసి మాధవరం కృష్ణారావు కలిశారు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. హౌసింగ్ బోర్డుకు చెందిన ఒక ఎకరం 17 గుంటల విలువైన స్థలాన్ని వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించినప్పటికీ ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం స్థలాన్ని స్వాధీనం కూడా చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ తో పాటు పలువురు అధికారులు వచ్చి ఆసుపత్రికి కేటాయించిన స్థలాల్ని స్వాధీనం చేసుకున్నట్లు హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఈ ఈ కిరణ్ బాబు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కృషి చేయడమే కాకుండా స్థలాన్ని స్వాధీనం చేసే విషయంలో చొరవ తీసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ను హౌసింగ్ బోర్డు వాసులు అభినందించారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకొనున్నారు.

కలెక్టర్ కి ధన్యవాదాలు…

ఆసుపత్రి స్థలం స్వాధీనం విషయంలో అడిగిన వెంటనే స్పందించి వారం రోజుల్లోనే స్థలాల్ని స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకున్న కలెక్టర్ మను చౌదరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version