అశ్వారావుపేట అభివృద్ధికి వంద రోజుల ప్రణాళిక

మున్సిపల్ కమిషనర్‌ నాగరాజు తో సమీక్షా సమావేశం
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట (ఆర్సి )

అశ్వారావుపేట పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఇటీవల రూ పదిహేను కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులను వినియోగించి వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళిక అమలుపై సమీక్షించేందుకు.ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నాగరాజు తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అధికారుల నుంచి వివిధ విభాగాల ప్రగతి నివేదికలు తీసుకున్నారు వంద రోజుల్లో పనులన్నీ పూర్తయ్యేలా శాఖల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలనే దిశగా నిర్ణయం తీసుకున్నారు అధికారులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారపార్టీ నాయకులు పట్టణప్రజలు వర్తకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment