అఘాయిత్యాలకు సమాజంలో అందరూ బాధ్యులే
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు
బిఏఎం డిగ్రీ కళాశాలలో అధ్యాపకులతో అభిప్రాయ సేకరణ
మహిళల అత్యాచారాలపై అభిప్రాయ సేకరణ
సమాజంలో ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యంత దారుణాలు జరుగుతున్నాయని చిన్న పెద్ద తేడా తెలియకుండా కామాంధులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని ఇలాంటి అధైత్యాలకు సమాజం మొత్తం బాధ్యత వహించాల్సిందేనని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వివిధ విద్యాసంస్థలలో ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ముఖ్యంగా అత్యాచారాల విషయమై పలువురు అభిప్రాయాలను సేకరించారు. బుధవారం స్థానిక బిఏఎం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకటయ్య గౌడ్, సీనియర్ లెక్చరర్ నాగరాజు, అధ్యాపకులు మశ్చీందర్, శ్రీకాంత్, వరలక్ష్మి, అఖిల, ప్రవీణ తదితరులతో మాజీ ఎమ్మెల్యే పక్కన ప్రత్యేకంగా మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న అత్యాచారాలపై వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు మాట్లాడుతూ.. సమాజంలో ప్రస్తుత తరుణంలో అందరిలో పాప బీహార్ సన్నగిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే సమాజంలో బతకలేం అనే భావనను అటు గ్రామ పెద్దలు కానీ ఇది ఇటు ఇంటి పెద్దలు కానీ ఎవరు నేర్పించడం లేదని, ఎవరికి ఏం జరిగితే మనకెందుకులే అని సులువుగా తీసిపారేయడంతో అఘాయిత్యాలు పెచ్చుమిరిపోతున్నాయని అన్నారు. కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు ఇంకా పెద్దలు తమ పిల్లల ప్రవర్తనకు, ఇష్ట రాజ్యానికి కారకులుగా మారి చెడుదారులలో నడిచే విధంగా ప్రోత్సహిస్తుందని అన్నారు. పిల్లలను చిన్ననాటి నుండి వారికి మంచి చెడులను తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోషల్ మీడియా, చిన్ననాటి నుండి చేతికి సెల్ఫోన్లు ఇవ్వడం, చిన్న అట్ల చేతికి జల్సా చేసేందుకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం, విచ్చలవిడిగా తిరుగుబోతులుగా ఉన్నప్పటికీ అతి గారాబం చేయడం ఇలాంటి ఎన్నో సమస్యలు కుటుంబ వ్యవస్థ నుండి ఎదురవుతున్నాయని అన్నారు. మనుషుల్లో పాపభీతి కొరవడిందని అన్నారు, చలనచిత్రాల ప్రభావం, పాశ్చాత్య ధోరణి, ఇంట్లో సంస్కృతి సంప్రదాయాలకు భిన్నంగా కార్యక్రమాలు నిర్వహించడం లాంటి అనేక అంశాలు సమాజంలో అఘైత్యాలకు ప్రోత్సాహకారంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబొట్టు వ్యవహారం నుండి మొదలుకొని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన నాడు కొంత అఘాయిత్యాలను నిర్మూలించవచ్చని అందరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకటయ్య గౌడ్ మహిళా అధ్యాపకురాళ్ళు ప్రవీణ, వరలక్ష్మి, అఖిల, నాగరాజు మంచి సూచన సలహాలు చేశారు. అన్ని విద్యా కేంద్రాలలో అభిప్రాయాలను సేకరించి చిన్ననాటి నుండి విద్యార్థులకు మంచి చెడు బోధించే విధంగా పాఠ్యాంశాలు పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..