Headlines in Telugu:
-
ఇల్లందకుంటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
-
రైతులకు మరింత సౌలభ్యం: ధాన్యం కొనుగోలులో కొత్త కేంద్రం
-
తహసిల్దార్ రాణి, వ్యవసాయ అధికారి సూర్యనారాయణ ప్రారంభించిన ధాన్యం కేంద్రం
-
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమం లో అధికారులు, రైతులు
*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తహసిల్దార్ రాణి వ్యవసాయ అధికారి సూర్యనారాయణ*
*ఇల్లందకుంట నవంబర్ 6 ప్రశ్న ఆయుధం::-*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ రాణి వ్యవసాయ అధికారి ముప్పిడి సూర్యనారాయణ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి తో కలిసి డిసిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తాసిల్దార్ రాణి మాట్లాడుతూ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేపట్టాలని గన్ని సంచులు అందుబాటులో ఉంచాలని సూచించారు రైతులు వరి ధాన్యాన్ని తాలూ తప్ప లేకుండా సరైన మ్యాచరు వచ్చిన తర్వాత విక్రయించాలని మ్యాచర్ రాకముందు విక్రయించినట్లయితే మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తారని ఇట్టి విషయాన్ని రైతులు గ్రహించి ఆరబెట్టి విక్రయించాలని కోరారు మ్యాచర్ వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రం వారు ఏమైనా ఇబ్బందులు పెడితే వారి పైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు మ్యాచర్ వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే లోడింగ్ చేసి పంపాలని కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ అశోక్ సూచించారు ఈ కార్యక్రమంలో రైతులు దాడువాయి హమాలీ తదితరులు పాల్గొన్నారు