*జమ్ము కశ్మీర్లో కాల్పుల మోత*
*చీకటి పడడంతో కాల్పులకు తెగబడుతున్న పాక్*
జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను నేలకూలుస్తున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నాయి. భయంతో పరుగులు తీస్తున్నారు. లైవ్ అప్ డేట్స్ తెలుసుకుందాం పదండి …
భారత్ పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
— భారత్ పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
— చీకటి పడడంతో కాల్పులకు తెగబడుతున్న పాక్
— యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో కాల్పులకు తెగబడుతున్న పాక్ బలగాలు
— జైసల్మేర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాక్ అవుట్
— పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత బలగాలు
— జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో హై అలర్ట్.